నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో టీబీ వ్యాధి నిర్ధారణకు నిక్షయ్ శివిర్ ఫేస్-2లో భాగంగా సోమవారం మొబైల్ పోర్టబుల్ చెస్ట్ ఎక్స్రే క్యాంపు నిర్వహించారు. మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 127 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణకు ల్యాబ్ కు పంపించినట్లు వైద్యాధికారిని డాక్టర్ సుస్మిత తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ… టీబీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే తగు జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేపూరి లచ్చయ్య, ఉప సర్పంచ్ భువనగిరి అజయ్ కుమార్, వార్డు సభ్యులు, ఎస్టీఎస్ తిరుపతి, ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ గౌతమ్, హెచ్ఈఓ నరసింహారెడ్డి, హెచ్ఎస్ దేవి జయ, ఏఎన్ఎంలు స్వరూప, రాజమణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.





