నేటి సాక్షి,నారాయణపేట, ఫిబ్రవరి 2, (రిపోర్టర్ ఇమామ్), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చోరీ జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్రదీప్ కుమార్ తెలిపారు. తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఆయన వివరించారు. పాఠశాలల్లో ఉన్న రింగ్స్ బాల్స్, చెస్ బోర్డులు, రికార్డ్స్, పలు సామాగ్రి ఎత్తుకెళ్లినట్లు ఆయన వివరించారు.

