*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రం1, 4 లో శుక్రవారం వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆరోగ్య సూత్రాల మీద ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, వాటి ప్రాధాన్యత బలమైన ఆహార పోషకాల విలువలపై తెలుపుతూ వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాసారపు భవాని అరవింద్ గౌడ్, అంగన్వాడి సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడి టీచర్లు .జెల, రమాదేవి వి.రమాదేవి .స్వప్న, గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యురాలు కాళ్ళ జమున, తల్లులు, గ్రామ ప్రజలు, గారు పాల్గొనడం జరిగింది





