*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండలకేంద్రంలోని అంగన్వాడీ 2 కేంద్రంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న మెట్టు ధనలక్ష్మి, సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించారు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఆట, పాటలతో పాటు మంచి విద్యను అందించడమే కాకుండా గర్భవతులకు బాలింత తల్లులకు సకాలంలో పౌష్టికాహారం అందించి విధులు సక్రమంగా నిర్వహించి నందుకు తను చేసిన సేవలు గుర్తించిన అధికారులు ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేయగా. ధనలక్ష్మి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.





