Friday, March 20, 2026

అంబేద్కర్ విగ్రహానికి ఘన సన్మానం

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 26,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని గోటూరు గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం నవంబర్ 26 -1949 అమల్లోకి వచ్చిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వలను హక్కులను తెలియజేస్తూ రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విగ్రహానికి పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోబి..ఎస్.పి నారాయణపేట జిల్లా అధ్యక్షులు* భోదిగల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కే.బాలరాజ్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సుక్కల రాజ్ కుమార్ సంఘ సభ్యులు పి రాజేష్ కుమార్, పి శ్రీను యాసిన్ ఖాన్, జి రామాంజనేయులు, జి కృష్ణ బి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News