*నేటిసాక్షి సిరిసిల్ల శివకుమార్* :-పీఎంశ్రీ కింద ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్ లో అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత విద్యాలయంలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులు, కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, రానున్న 20 రోజుల్లో పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యాలయంలో విద్యార్థులు సంఖ్య, ఎన్ని తరగతి గదులు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.*అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలి*అనంతరం పదో తరగతి విద్యార్థుల క్లాసు రూమ్ కు వెళ్లి వారితో కలెక్టర్ మాట్లాడా





