Friday, March 13, 2026

*అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండండి.**కమిషనర్ ఎన్. మౌర్య.*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)అల్పపీడనంతో కురుస్తున్న వర్షాల్లో నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాయం అందించేందుకు అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో బుధవారం కమిషనర్ టెలి కాన్ఫరన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఇంకా రెండు రోజులు నగరంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సాయం అందించేందుకు అందరు అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యాలయంలో 24గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్లు 0877 222356776, 9000822909 లో అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు. వర్షాల వలన త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించి, క్లోరైనేషన్ చేయాలనీ తెలిపారు. ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ఎక్కడైనా రోడ్లు గుంతలు పడితే, వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మురికినీటి డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని తెలిపారు. ఎక్కడైనా మ్యానహోల్ ఓపెన్ చేస్తే బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లపైన చెత్త కుప్పలు, బురద తొలగించి బ్లీచింగ్ వేయాలని తెలిపారు. ఎక్కడైనా చెట్లు పడేలా ఉన్నా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా కంట్రోల్ సెంటర్ ను సంప్రదించాలని తెలిపారు. పురాతన భవనాల్లో నివాసం ఉండొద్దని ప్రజలకు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News