Friday, March 20, 2026

*అనారోగ్య భర్తను..స్మశానంలో వదిలేసిన భార్య.!*———–* కుటుంబ నిర్లక్ష్యం పై కలకలం… స్థానికుల అప్రమత్తతతో నిలిచిన శ్రీధర్ ప్రాణాలు * కిడ్నీ వ్యాధితో పోరాటం… ఆర్థిక భారమా.? లేక మానవత్వం లోపమా.?* జగిత్యాలలో హృదయవిదారక ఘటన—*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో ( రాధారపు నర్సయ్య )**”జగిత్యాల పట్టణంలో మానవత్వాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. రెండు కిడ్నీలు పూర్తిగా పాడై ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీధర్‌ అనే వ్యక్తిని.. అతనిచే తాళి కట్టించుకున్న భార్యనే..కుటుంబ సభ్యుల సహకారంతో స్మశానవాటికలో వదిలేసి వెళ్లడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్థానికుల అప్రమత్తతతో ఆయనను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు కాపాడబడ్డాయి..”!*—*హృదయాన్ని కదిలించే ఘటన ఇది.!*జగిత్యాల పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. శ్రీధర్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. జీవన్మరణ పరిస్థితుల మధ్య పోరాడుతున్న సమయంలో, అతని భార్య సహా కుటుంబ సభ్యులు అతన్ని పట్టణంలోని స్మశానవాటికలో వదిలి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.*ఆసుపత్రిలో చేర్చిన అదే స్థానికులు*ఈ ఘటనను గమనించిన స్థానికులు మొదట ఆశ్చర్యానికి గురై, వెంటనే స్పందించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో శ్రీధర్ ప్రాణాలు తాత్కాలికంగా నిలిచాయి.ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.*జగిత్యాల పోలీసుల దర్యాప్తు*ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఇది హత్యాయత్నం లేదా క్రిమినల్ నిర్లక్ష్యం కోణంలో విచారణ జరుపుతున్నారు. బాధితుడిని ఇలాంటి స్థితిలో వదిలేసిన కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.!*మానవత్వమా..నీ చిరునామా ఎక్కడా.?*ఈ సంఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని కాపాడాల్సిన బాధ్యత ఉన్న కుటుంబ సభ్యులే అతన్ని వదిలిపెట్టడం సమాజంలో విలువల పతనాన్ని చూపిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.!*ఆర్థిక భారమా… సామాజిక సమస్యా.?*కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు డయాలసిస్, మార్పిడి చికిత్సలు ఖరీదైనవిగా ఉండటం అందరికీ తెలిసిందే.! ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు, వైద్య ఖర్చుల భారం కొందరు కుటుంబాలను తీవ్ర నిర్ణయాల వైపు నెట్టేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనికి మానవత్వం మరిచిపోవడం సమర్థన కాదని సామాజిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.*సహాయం కోసం ముందుకు వచ్చిన ప్రజలు.!*ప్రస్తుతం శ్రీధర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. స్థానికులు, కొన్ని సామాజిక సంస్థలు అతని వైద్య ఖర్చుల కోసం సహాయం అందిస్తున్నాయి.ఈ ఘటన మన సమాజానికి ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నా మానవత్వం కోల్పోవద్దని, బాధలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.!_____________________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News