నేటిసాక్షి, కరీంనగర్:మరో మూడేళ్లలో తాను ఇచ్చిన హామీలను అమలుచేస్తానని, నేను రాజీనామా చేయాలా? వద్దా? అనేది ధర్మపురి ప్రజలే నిర్ణయిస్తారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శుక్రవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేదే తన సంకల్పమన్నారు. గత పాలకులు 2016లో ప్రారంభించిన ప్రాజెక్టును 2022 వరకు కూడా పూర్తి చేయలేదని, కానీ, అంచనాలను మాత్రం 136 కోట్లకు పెంచారని విమర్శించారు. ఎలాంటి అనుమతుల్లేకుండా అప్పటి కాంట్రాక్టరుతో చీకటి ఒప్పందాలు చేసుకొని తూతూమంత్రంగా పనులు ప్రారంభించారని ఆరోపించారు. కాళేశ్వరం లింకు`2 పేరుతో 1,020 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, ధర్మపురి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్న కేసీఆర్ మాటలు నీటిమూటలే అయ్యాయన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న మంత్రు





