నేటి సాక్షి నారాయణపేట,అక్టోబర్ 14,, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామ స్టేజి సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర ఆగి ఉన్న టిప్పర్ను రైచూర్ నుండి వస్తున్న కారు ఢీకొని బోల్తా పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న షట్టర్ లోకి వెళ్లడంతో సెటర్ లో ఉన్న వ్యక్తికి ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం 108 లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





