నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 28
పెంచికల్పేట్. మండలంలోని అగర్ గూడ గ్రామానికి చెందిన తుమ్మిడ రాజశేఖర్ నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఉసిగొల్పిన వ్యక్తిని ఇదివరకే పోలీసు వారు రిమాండ్ చేయడం జరిగింది.
ఈ ఈరోజు వారి తల్లిగారు తుమ్మిడ లక్ష్మీ గారిని పరామర్శించి లక్ష రూపాయల చెక్కును అందించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చడం సరికాదని హితవు పలికారు. అలాగే పారాక్విట్ అనే గడ్డి మందు విరివిగా దుకాణాల్లో దొరుకుతుందని, ఆ గడ్డి మందు తాగితే నూటికి నూరు శాతం మంది చనిపోతున్నారనే విషయాన్ని అసెంబ్లీలో తాను ప్రస్తావించానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ గడ్డి మందును బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భాజపా మండల అధ్యక్షులు కుకిడే రాజేశ్వర్ , ఘనపురం నగేష్, బోయిరే నాన్నయ్య, పల్లెం పురుషోత్తం, కుకిడే వెంకన్న, పాలె సంతోష్, పాగిడి అనంత రావు, కాంతా రావు, సిరిపురం భీమయ్య వగాడి కిషన్ తదితరులు పాల్గొన్నారు.





