నేటి సాక్షి, కరీంనగర్: ఈద్-అల్-అదా (బక్రీద్) పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈద్ నమాజ్ అనంతరం ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రధాన ఈద్గాలు, మసీదులు కిక్కిరిశాయి. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ.. త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వ దినాన్ని ముస్లిం సోదరులు జరుపుకున్నారు. త్యాగానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పండుగ సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాలి, దయ, కరుణ అనే స్ఫూర్తిని నింపుతుందని పలువురు ఆశాభావం వ్యక్తంచేశారు.
