నేటి సాక్షి ప్రతినిధి ( చేవెళ్ల న్యూస్ సుధాకర్ గౌడ్ ముదిలి ) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట్ట గ్రామ ప్రజలు గురువారం నాడు గ్రామ సమస్యల గురించి గౌరవనీయులైన ఎమ్మెల్యే కాలె యాదయ్య గారిని కలిసి కమ్మెట గ్రామానికి సంబంధించిన బస్సు సౌకర్యం గురించి మాట్లాడడం జరిగింది. శంకరపల్లి నుంచి చేవెళ్ల వెళ్లే బస్సు కమ్మెట గ్రామం నుండి వెళ్లే విధంగా వికారాబాద్ DM గారికి కాల్ చేసి మాట్లాడించడం జరిగింది. అదేవిధంగా కమ్మెట x రోడ్ నుండి మెహిదీపట్నం వెళ్లే బస్సు కమ్మెట గ్రామం నుండి వెళ్లే విధంగా మెహదీపట్నం DM గారితో మాట్లాడించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో మన గ్రామం నుంచి ఈ రెండు రూట్లలో బస్సులు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. MLA యాదయ్య గారికి కృతజ్ఞతలు





