Tuesday, March 17, 2026

*ఓటరు జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి** డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి* జనవరి 13లోగా అన్ని దశల పూర్తి — రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు–*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటరు జాబితాల్లో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, డూప్లికేట్ పేర్లు, బ్లర్ ఫోటోలు వంటి లోపాలను గుర్తించి తప్పనిసరిగా సరిదిద్దాలని సూచించారు.—*వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష*సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్ తదితర అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.*ఎలక్టర్ మ్యాపింగ్ కీలకం : సీఈఓ*ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్టర్ మ్యాపింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలని, ఓటరు జాబితాల్లో ఒకే వ్యక్తికి సంబంధించిన సమాన వివరాలు ఉన్న ఎంట్రీలు, డూప్లికేట్ ఎంట్రీలు జాగ్రత్తగా గుర్తించి సవరణలు చేపట్టాలని ఆదేశించారు.బ్లర్ ఫోటోలు ఉన్న ఎంట్రీలను తప్పనిసరిగా సరిచేయాలని, ఓటరు జాబితా ఖచ్చితమైనది, విశ్వసనీయమైనదిగా ఉండేలా అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఈ మొత్తం ప్రక్రియను జనవరి 13 నాటికి పూర్తి చేయాలని నిర్దేశిత గడువును గుర్తుచేశారు.*జగిత్యాల జిల్లాలో పురోగతిపై సమీక్ష : కలెక్టర్ సత్యప్రసాద్*జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…జగిత్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పనుల పురోగతిని గణాంకాల ఆధారంగా సమీక్షించినట్లు తెలిపారు.డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫోటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తహసీల్దార్లను ఆదేశించారు.*క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన నమోదు అవసరం*జిల్లాలో స్వీకరించిన దరఖాస్తులు, సవరణలు, తొలగింపులు, నవీకరణల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు వేగవంతం చేయాలని, అన్ని పనులు నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని ఆదేశించారు.*పోలింగ్ స్టేషన్ స్థాయిలో సమన్వయం*ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారులు (BLOలు) సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు.సూపర్‌వైజర్లకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించాలని, ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా జిల్లాలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లోఅదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్.లత,జగిత్యాల, కోరుట్ల ఆర్డీఓలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి,తహసీల్దార్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News