Wednesday, January 21, 2026

*ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి**ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు**ఓసి ల సింహ గర్జన సభను విజయవంతం చేయాలి**రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి పిలుపు*—————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి ఐకాస నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనవరి 11నవరంగల్ లోలక్ష మందితో నిర్వహించ తలపెట్టిన ఓసి ల సింహగర్జన సభ ఏర్పాట్లపై సోమవారం జగిత్యాల లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జగిత్యాల జిల్లా స్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశం లో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాల నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఓసి సామాజిక సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి, చీటి శిరీష రావు, ఐకాస నాయకులు అయిల్నేని సాగర్ రావు, మహంకాళి రాజన్న, సిరిసిల్ల శ్రీనివాస్, పుల్లూరి సత్యనారాయణ, సిరిసిల్ల రాజేందర్ శర్మ, చీటి శ్రీనివాస్ రావు లు మాట్లాడారు.*జాతీయ అధ్యక్షులు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ*ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏళ్ల కాలపరిమితి కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలని, ఈడబ్లూఎస్ వారికి కేటాయించిన మిగిలి పోయిన బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. టెట్ రాత పరీక్ష అర్హతకు 90 మార్కుల నుంచి 70 మార్కులకు తగ్గించాలని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్ళేందు కోసం జనవరి 11 న సాయంత్రం 3 గంటలకు హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో లక్ష మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి “ఓసి ల సింహగర్జన” భారీ బహిరంగ సభకు ఓసి లంతా రాజకీయాల కతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా సింహగర్జన బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఐకాస నాయకులు ఆవిష్కరించారు.సమావేశంలో నాయకులు మోతే ఉమాపతి శర్మ, వెంకటేశ్వర్ రావు,దేవరశెట్టి జనార్దన్, బద్ధం నారాయణ రెడ్డి, మందల గోపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి,నాగిశెట్టి అపర్ణ, అయిల్నేని స్వప్న, పురుషోత్తం రావు, సందీప్ రావు, సిరిసిల్ల వేణుగోపాల్, చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News