Saturday, January 17, 2026

కలెక్టర్​ను కలిసిన జడ్జిలు

నేటి సాక్షి, కరీంనగర్​: ఉమ్మడి జిల్లాలోని పలువురు జడ్జిలు సోమవారం కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 9 మంది జడ్జిలు విధుల్లో భాగంగా శిక్షణ తీసుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్ కు వచ్చిన జడ్జిలు కలెక్టర్ ను కలిసి, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
.. ఈవీఎం గోదాము పరిశీలన..
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచేందుకు గోదాంలో గదులను పర్యవేక్షించారు. అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు అనుకూలంగా ఉన్న గదులను ఎంపిక చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎంల నోడల్ ఆఫీసర్ కిరణ్ ప్రకాష్, కలెక్టరేట్ ఏవో సుధాకర్, సూపరిండెంట్ శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News