నేటి సాక్షి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున టిక్కెట్ను కేటాయించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విన్నవించారు. ఈ మేరకు బుధవారం ఆయన కరీంనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి 45వ డివిజన్ టిక్కెట్ను కేటాయించాలని కోరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, డివిజన్లో సమస్యల పరిష్కారానికి కషిచేస్తున్న తనకు అవకాశం కల్పించాలన్నారు.

