నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 16 మండలంలోని పంచాయతీ కేంద్రం పెద్ద ఎల్లకుంటకు సమీపంలో గల ఓ రైతుకు చెందిన వ్యవసాయ బోరు మోటర్ లో అమర్చిన కేబుల్ వైరును దుండగులు చోరీ చేశారు బాధిత రైతు నాగరాజా కథనం మేరకు చౌడేపల్లి పుంగనూరు ప్రధాన రహదారిలో నర్సరీ పక్కనే ఉన్న వ్యవసాయ బోరుకున్న కేబుల్ వైరును శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించుకుని వెళ్లారని వాపోయాడు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నాగరాజు తెలిపాడు





