నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*కార్వేటి నగరం* గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కృపా లక్ష్మి మండల ఎంపీపీ లతా బాలాజీ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ కసరత్తులను అడ్డుకొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని అక్కులగోపి అన్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగర మండలం సిడి కండ్రిగ, టికెయం పేట పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ సందర్భంగా గ్రామలలో ఇంటింటికి కూటమి ప్రభుత్వ చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు పరచడానికి కోటి సంతకాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగమ్మ ఎంపీటీసీ ధనరాజ్,మహేష్,రంగయ్య,రాజారామ్,కుప్పరెడ్డి,మురళి వెంకటేష్ సుబ్రమణ్యం,నరసింహలు,స్థానిక నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.





