Friday, February 20, 2026

*కోరుట్లలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ భూముల ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహణ*

*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన అయిలాపూర్ రోడ్‌లో ఉన్న భూముల సర్వే నంబర్లు 1399/1, 1499, 1505, 1521 వంటి పడావ్ భూములపై ‘ఎంజాయ్‌మెంట్ సర్వే’ (ఆనందించే హక్కు/ప్రస్తుత వినియోగ సర్వే) నేడు నిర్వహించబడింది.ఈ సర్వేను ఆరుద్ధ మండల సర్వేయర్ జి. కుమారస్వామి ఆధ్వర్యంలో, కోరుట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రవీణ్, సూర్యరేఖ గాండ్లతో కలిసి నిర్వహించారు.సర్వేలో దేవాలయ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ (EO) ఎం. విక్రమ్, ఆలయ చైర్మన్ ఎతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు నేతి శ్రీనివాస్, కటుకం దివాకర్, తోట గంగాధర్, గొడికె రాములు, చిలువేరి విజయ్ కుమార్, పద్మ, దర్శయ్య, ఆర్. గంగాధర్, కె. రాజేంద్ర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సర్వే ద్వారా దేవాలయ ఆస్తుల సరైన స్థితి, వినియోగం, హక్కులను ధ్రువీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితాల ఆధారంగా భవిష్యత్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News