Wednesday, January 21, 2026

క్షయ నివారణకు కృషి చేయాలిజిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్


నేటిసాక్షి, రాయికల్ :
క్షయ వ్యాధి నివారణకు టీబి చాంపియన్లు కృషి చేయాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు. రాయికల్ మేరు సంఘ భవనం లో గురువారం టీబి చాంపీయన్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో క్షయ వ్యాధి నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సతీష్ కుమార్ హెఛ్ఇఓ సాగర్ రావ్, సూపర్ వైజర్ లు శ్రీనివాస్, ఉమారాణి, స్టేట్ లీడ్ పురుషోత్తం, డిస్ట్రిక్ట్ లీడ్ రవి, అనిల్, మెట్ పల్లి టీబీ ఎస్టిఎస్ ఆంజనేయులు, ఎఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 19RKL03: శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ శ్రీనివాస్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News