నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 2ఆరోగ్యశాఖ జిల్లా గణాంక అధికారి జార్జి ఆధ్వర్యంలో మండలంలోని పలు ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు శిశువులు లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు గర్భవతుల్లో రక్తహీనత వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజేసి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఆయా ఉపకేంద్రాల్లో రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ని మోనా ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు





