Wednesday, January 21, 2026

గన్నేరువరం మండలంలో డబల్ బెడ్ రూమలు నిర్మించినటువంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

మండలం సిపిఐ నాయకులు డిమాండ్

నేటి సాక్షి, గన్నేరవరం, (బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండల కేంద్రంలో నిర్మించినటువంటి డబల్ బెడ్ రూమ్ లను మంగళవారం రోజున సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాసిరకంతో నిర్మించినటువంటి రూములు మెట్లు కూలిపోవడం జరిగిందని సొమ్ము కోసం ఆశ పడ్డ కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ వాడడం సరైన మొతదులో సిమెంట్ కలపకపోవడం వలన ఎక్కడిక్కడ కూలిపోవడం తొ లక్షల్లో నష్టం వాటిల్లిందని ఇంతటి ప్రజాధనం వృధా చేసినటువంటి సంబంధిత కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఇల్లు ఇలానే నిర్మించుకున్నాడా పట్టుమని 6 ఏండ్లు కాలేదు అప్పుడే ఇలా జరిగితే ఎలా అని మండిపడ్డారు పేదల కోసం నిర్మాణం చేపట్టి వారికీ స్వంత ఇంటి కలలు నెరవేరుతాయానీ ఆశపడ్డారు వారి ఆశల పై నీళ్లు చల్లారు అని అన్నారు ఇప్పటికి అయినా సంబంధించిన కాంట్రాక్ట్ర్ పైన చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇండ్లను ఇల్లు లేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేసారు చేయా లేని పక్షంలో రాబోయే కాలంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు .మండలంలో మంజూరు అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు ను త్వరలోనే వాటిని పరిశీలిస్తామన్నారు. అర్హులైన వారిని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చోక్కల్ల శ్రీశైలం జిల్లా నాయకులు కాంతాల అంజిరెడ్డి మండల సహాయ కార్యదర్శిలు కూన మల్లయ్య పిప్పల్ల కనకయ్య ఆంజనేయులుచారి, న్యాత కొమరయ్య,నయీమ్, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News