నేటి సాక్షి, దేవరకద్ర అక్టోబర్ 16మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయనతోపాటు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే టిబి అధికారులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో మరియు కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ప్రముఖులు, జిల్లా అధికారులు ముఖ్యమైన ప్రజా ప్రతినిధులతో కూడా ఎమ్మెల్యే కలిశారు.




