నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 4చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లిలో మార్గశిర పౌర్ణమి పురస్కరించుకొని అభయాంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు ఉదయాన్నే స్వామివారికి విశేష అభిషేకము అలంకరణ గావించారు పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఉభయ దారులు గిరినాథ్ ప్రకాష్ రమణల ఆధ్వర్యంలో భక్తులకు పవిత్ర తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు




