నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నిక నేపధ్యంలో గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ముస్కు దీప్తి నిశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ సర్పంచ్ గా తనకి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలని కోరారు.తాను సర్పంచ్ గా గెలిస్తే నిత్యం ప్రజలంద్యలో ఉంటూ గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ గ్రామ ప్రజలకి సంక్షేమ పథకాలు అందేలా చేస్తూ గ్రామంలోని సమస్యలని పరిష్కారం చేస్తూ మన గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీ గా తీర్చిదిద్దుతాను అని అన్నారు.గ్రామంలోని ప్రజలు మరియు యువత నాకు మద్దతుగా నిలిచి ఈ ఎన్నికలో తనకి ఓటు వేసి సర్పంచ్ గా ఎన్నుకోవాలని ప్రజలందరిని వారు కోరడం జరిగింది.





