Saturday, January 17, 2026

గోనే సల్మన్ రాజుకు నామినేట్ పదవి ఇవ్వాలిఅన్ని క్రైస్తవ సంఘం డిమాండ్

నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుసిద్దిపేట జిల్లా రాష్ట్రంలో 119 నియోజవర్గంలో క్రిస్టియన్ సమాజం గోనే సాల్మన్ రాజుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల కోసం ఆయన జీవితం అంకితం చేసిన వ్యక్తిని గత 30 సంవత్సరాల నుండి క్రైస్తవ సమాజం చైతన్య పరచడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి గోనే అని ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం క్రైస్తవులు గుర్తు చేశారు. ఇప్పటికే ఎన్నో పదవులు చేపట్టాల్సిన వృత్తి కానీ ఆయన పదవుల కోసం కాక ప్రజల కోసం పనిచేస్తున్నారు. కావున ఆయన సేవలు క్రైస్తవ సమాజం మర్చిపోలేదని క్రైస్తవ సమాజం కోటి జనాభా ఉన్న మేము మాకు నాయకత్వం నాయకుడు లేడు కావున మా తరఫున సమాజం తరఫున పోరాటం చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి మా నాయకుడు సల్మన్ రాజుకు వెంటనే చైర్మన్ పదవి ఇవ్వాలని దుబ్బాక నియోజకవర్గం క్రిస్టియన్ పాస్టర్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన సల్మన్ రాజుకు వెంటనే చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గం క్రిస్టియన్ పాస్టర్లు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రెసిడెంట్ పాస్టర్ సత్యం పాస్టర్ దినకర్ పాస్టర్ ప్రభుదాస్ పాస్టర్ తిమోతి పాస్టర్ జీవన్ రాజ్ పాస్టర్ గిధ్యోను,పాస్టర్ మార్క్ ,పాస్టర్ నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News