నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 8,నారాయణపేట పట్టణ కేంద్రంలోని సివిఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచుకున్నారు, జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి పనులను చేపడుతున్నారని ఆ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ కి ఆయన పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, మాజీ కౌన్సిలర్ సతీష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు యూసుఫ్ తాజ్, ఉపాధ్యక్షులు పళ్ళ అనిల్, మజీద్, రవి గౌడ్, చిట్టెం సత్య రెడ్డి, శ్రీ, అభి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,సీతారాం రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.





