నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,టెంపుల్ చైర్మన్ జెల్ల ప్రభాకర్, జిల్లా నాయకులు బైరసంతోష్,మల్లేశం,కుమార్,రావుల నర్సయ్య,శ్రీకాంత్, సందీప్, రాములు, వేణు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.





