నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 14 మండలంలోని పంచాయతీ కేంద్రం చారాల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేణుక పూజా కార్యక్రమంతో ప్రారంభించారు పాఠశాల ఉపాధ్యాయులు మరియుప్రారంభించారు పిల్లలు అనేక రకాల ఉపన్యాసాలు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోనే విద్యార్థిని విద్యార్థులు అందరికీ ఆటల పోటీలు నిర్వహించి. ఆటల పోటీలలో గెలుపొందిన 150 మంది విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి ఐదు వేల రూపాయలు విలువచేసే బహుమతులను( మెడల్స్) పిల్లలకు అందించారు తర్వాత పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు





