నేటి సాక్షి మార్చి 11 (మంచిర్యాల్) శ్రీధర దమ్మ మంచిర్యాల జిల్లా,చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి *కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు.మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహేశ్ ప్రసాద్ తివారీతో పాటు కమిటీ సభ్యులు కూడా పదవీ ప్రమాణం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ మరియు సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలని సూచించారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొత్త చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.





