నేటి సాక్షి నారాయణపేట జనవరి 27,, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది. ఈ వ్యక్తి వయస్సు 45 సంవత్సరాలలోపు ఉంటాడని గ్రామస్తులు వివరించారు. ఈ సంఘటన పై పెద్ద చింతకుంట గ్రామస్తులు మరికల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి మరికల్ ఎస్సై రాములు పరిశీలించడం జరిగింది.





