నేటి సాక్షి, చేర్యాల: 22 అక్టోబర్పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు సుమారు 100 ,మంది విద్యార్థులు, పాల్గొన్నారు. వారికి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఫంక్షన్ చట్టాలు అమలుపరుస్తున్న తీరు, కేసులు నమోదు, నేరస్తులను పట్టుకోవడం, ప్రజల ధనమాన ప్రాణ రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, జరుగుతున్న సైబర్ నేరాల గురించి, పోలీస్ స్టేషన్లో ఉన్న వివిధ గదులు మరియు సీసీ కెమెరాలు ఫంక్షన్, డయల్ 100 ప్రాముఖ్యత, బ్లూ కోర్స్, పెట్రో కార్, పోలీసుల ముఖ్య విధుల గురించి తదితర అంశాల గురించి, పోలీసులు ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ, సీఈఆర్ ద్వారా ఫోన్లో రికవరీ,కమ్యూనికేషన్ విహెచ్ఎఫ్ సెట్.తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన ఎస్ఐలు నవీన్, షేక్ మహబూబ్, రాజు గౌడ్ పాల్గొన్నారు.





