నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………కరీంనగర్ జిల్లాలో గురువారం ఫిలిం క్లబ్ యందు జరిగిన తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాళోజి పురస్కారాల కార్యక్రమంలో జగిత్యాల జిల్లాకు చెందిన కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు కు కళా రంగంలో సేవలకు గాను ప్రముఖ సినీ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ చేతుల మీదుగా గుండేటి రాజు కు కళా పురస్కారం అందజేశారు. ఈ పురస్కారం పట్ల జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, కవులు కళాకారులు హర్షం వెలిబుచ్చారు.





