నేటి సాక్షి, కాగజ్నగర్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని అనుకోడ గ్రామ అటవీప్రాంతంలో జింక మృతి చెందింది. శనివారం గ్రామస్తులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి ఎఫ్ఆర్ఓ రమాదేవి, వెటర్నరీ డాక్టర్ విజయ్ వచ్చారు. జింక కళేబరాన్ని పరిశీలించారు. కుక్కల దాడిలో జింక మృతి చెందినట్టు నిర్ధారించారు. పంచనామా అనంతరం దహనం చేసినట్లు ఎఫ్ఆర్ఓ రమాదేవి చెప్పారు.

