నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ పట్టణంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలైన కొత్తగాడి అల్లంపల్లి ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాటు పోలీస్ బందోబస్తును ఎస్పీ సమీక్షించారు.ఓటింగ్ ప్రశాంతంగా పూర్తి అయ్యేవరకు అప్రమత్తం గా ఉండాలని,సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేశారు. జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఎన్నికల కోడ్ ఉంటుంది అని, కావున ప్రతి ఒక్కరు ఎంసీసీ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఇట్టి సందర్బంగా తెలియజేయడం జరిగింది.

