Wednesday, January 21, 2026

జెల్ పల్లిలో భార్య ఇద్దరు పిల్లలు అదృశ్యం

భార్యపై చేయి చేసుకున్న భర్త

జల్‌పల్లి ఎన్‌క్లేవ్ లో కుటుంబ కలహం.. భార్య ఇద్దరు పిల్లలతో అదృశ్యం

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో ఘటన
19.06.2025 ఉదయం 10:00 గంటలకు,జాతవత్ వెంకటేష్ S/o రాంజీ, వయస్సు 32 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్,నిత్య ఎన్‌క్లేవ్,జల్‌పల్లి,రంగారెడ్డి జిల్లా పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాలు ప్రకారం ఫిర్యాదుదారుడు తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి గత 6 సంవత్సరాలుగా జల్‌పల్లిలో నివసిస్తున్నాడు.17.06.2025 సాయంత్రం సుమారు 7:00 గంటలకు, ఫిర్యాదుదారుడు మరియు అతని భార్య మధ్య వైవాహిక వివాదం ఏర్పడింది,దాంతో రాత్రి గొడవలో అతను ఆమెను కొట్టినట్లు పేర్కొన్నారు.అనంతరం,అతను పనికి వెళ్ళిపోయాడు.18.06.2025 ఉదయం 06:00 గంటలకు విధుల నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు,అతని భార్య పిల్లలతో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు గమనించగా,అప్పటి నుండి ఆమె తిరిగి రాలేదని పేర్కొన్నారు.చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆమె ఎక్కడ కనిపించలేదని తెలిపారు.తప్పిపోయిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:భార్య: ముఖం: ఓవల్,రంగు: ఫెయిర్, ఎత్తు: 5 అడుగులు 2 అంగుళాలు.ముదటి కుమారుడు సుశాంత్:ముఖం: ఓవల్, రంగు: ఫెయిర్, ఎత్తు: 3 అడుగులు 8 అంగుళాలు.చిన్న కుమారుడు శ్రీశాంత్: ముఖం: ఓవల్, రంగు: ఫెయిర్, ఎత్తు: 3 అడుగులు.ఫిర్యాదుదారుడు,అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News