పదవి విరమణ కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ సూపర్వైజర్ బి కుమార్ మరియు శానిటైజర్ ఆఫీసర్ శీను కార్మికులను సన్మానించారు
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపల్ పరిధిలో… మున్సిపల్ కార్మికులుగా గత 20 ఏళ్లుగా సేవలందించిన జల్ పల్లి గ్రామానికి చెందిన యంజాల పోచమ్మ.జామ నరసమ్మ. వై అమృత. మంద పెంటయ్య.. వీళ్ళందరికీ వయసు 60 ఏళ్ళు పూర్తి కావడంతో జల్ పల్లి గ్రామం మరాఠా భవన్ లో మున్సిపల్ సూపర్వైజర్ బి కుమార్ శానిటైజర్ ఆఫీసర్ శ్రీను ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు.వై జయమ్మ.ఏ అరుణమ్మ. జామా భూదేవి. వై అండాలు. ఎం పద్మ.వై లలిత. సంధ్య.వై సమంత.జి యాదమ్మ. వై హేమలత. బి సురేష్. జామ బాలకృష్ణ.గణేష్.వై కుమార్.రవి,వై శివకుమార్ మరియు వార్డు ఆఫీసర్ పాల్గొన్నారు





