ఇబ్రహీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు టీంగిరికారి.నరేందర్ తండ్రి టీంగిరికారి ఇబ్రహీం మరణ వార్త స్థానిక నాయకులతో తెలుసుకున్న సబితమ్మ మహేశ్వరం గ్రామం చేరుకుని ఇబ్రహీం చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ల చెంద్రయ్య ముదిరాజ్, స్వర్ణగంటి ఆనందం, మునగపాటి నవీన్, కర్నాటి మనోహర్, నిమ్మగూడెం సుధీర్, కాడమోని ప్రభాకర్, బాలయ్య,మిద్దింటి యాదగిరి, ఆకుల వీరిబాబు, సున్నం కృష్ణ, మహేష్ తదితరులు ఉన్నారు..





