నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 18.నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం మరియు ఎంపీపీ ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహించారు . ముందుగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తూ సమాజంలో ఇలాంటి వాటిని ఎవరైనా చూసినా సమాచారం పోలీసు వారికి అందించే విధంగా సహకరించాలని వారిని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్, (గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుష్మాన్) డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంతోషిని, మరియు వెంకటలక్ష్మి, ఎం.ప్రశాంతి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





