నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 17, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ సూపర్ 18న జరిగే రాష్ట్ర బంద్కు సహకరించాలని నారాయణపేట బీసీ సంఘం కానుగంటి నారాయణ, వీర బసంత్ కుమార్ కోరారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో తిరుగుతూ దుకాణదారులకు బందుకు సహకరించాలంటూ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18న జరిగే బందుకు వ్యాపారస్తులు సహకరించాలన్నారు. అఖిలపక్ష నాయకులు బందుకు సహకరించాలన్నారు. బీసీ సంఘం నాయకులు లంబడి తిరుపతయ్య, మంగలి వేణుగోపాల్, రవికుమార్, గొల్ల రాజేష్, గోవర్ధన్, రమేష్, కురువ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.




