Tuesday, March 10, 2026

తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ రెడ్డి.. అమర్ కి సన్మానం

నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులు తొగుట మండల సమాఖ్య సమావేశం కు తొగుట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ. విజయ్ రెడ్డి (అమర్) ఆహ్వానించడం జరిగిందివిజయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి మహిళలకు అందిస్తున్న పతకాలను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది,మార్కెట్ చైర్మన్ గా మహిళలకు తన వంతు పూర్తి సహకారం మండల స్థాయిలో ఉంటుంది అని చెప్పడం జరిగింది, మహిళలు గతంలో మాజీ మంత్రి వర్యులు శ్రీ చెరుకు ముత్యం రెడ్డి సహకారం తో మక్కలు కొనుగోలులో రాష్ట్రం లోనే అత్యధికంగా తుక్కాపూర్ గ్రామ సంఘం తరపున కొనుగోలు చేసి రికార్డ్ నెలకొలపడం జరిగింది, అప్పుడు ఉన్న కలెక్టర్ స్మిత సభర్వాల్ గారిచే అవార్డు తీసుకో వడం జరిగింది అని గుర్తు చేసారు ఇప్పుడు కూడా వడ్లు మాత్రమే కాకుండా మక్కలు కూడా మహిళలు చేసుకుని అర్థికంగా ఎదగాలను ప్రభుత్వం అన్ని అవకాశాలు మహిళలకు ఇస్తుంది అని చెప్పడం జరిగింది, ప్రస్తుతం నడుస్తున్న 12 సెంటర్లు మాత్రమే కాకుండా అన్ని గ్రామ సంఘాల నుండి కూడా మహిళలు ముందుకు వస్తే వారికే మిగితా గ్రామాలలో కూడా, మార్కెట్ సెంటర్లు ఇచ్చి వారికీ అన్ని విధాలుగా సహకారం ఇస్తాం అని చెప్పడం జరిగింది, అలాగే మహిళలు ఎవరైనా ముందుకు వస్తే శ్రీ చెరుకు శ్రీనివాస రెడ్డి సహకారం తో మహిళల కోసం టీ కప్ గాని ఇంకా ఏదైనా కంపెనీ ఉపాధి కోసం, పెట్టుకోవడానికి కూడా సహకారం ఇస్తాము అని చెప్పడం జరిగింది, సమావేశంలో అన్ని గ్రామాల vo అధ్యక్షురాలు లుసిబ్బందిఏపీఎం, సీసీ లు, అకౌంటెంట్, ఆపరేటర్ లు పాల్గొన్నారు,అనంతరం చైర్మన్ విజయ్ రెడ్డి గారికి చిరు సన్మానం శాలువా తో సత్కారం చేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News