Thursday, March 19, 2026

దుబాయ్ క్రిస్మస్ సంబరాలకు ఎలమంచిలి ప్రవీణ్ కు ఆహ్వానం

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) యూఏఈ దేశంలోని లోని దుబాయ్ నందు జరిగే క్రిస్మస్ సంబరాల కోఆర్డినేటర్ నీలా శామ్యూల్ రత్నం మాట్లాడుతూ క్రిస్మస్ సంబరాలలో భాగంగా యోహోవా షాలోమ్ ప్రార్థన మందిరం స్త్రీల క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులుగా బిషప్స్ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ ,చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ కు ఆహ్వానం అందిందని తెలిపారు . ఈ సందర్భంగా ఆ చర్చి పాస్టర్ రెవరెండ్ సంపద రావు ఆడిదల మరియు పాస్టర్ నల్లి మోహనరావు డిసెంబర్ 14వ తేదీ ఆదివారం 12 గంటల నుండి రెండున్నర గంటల వరకు ఈ కార్యక్రమం జరగనున్నదని అనంతరం గ్రాండ్ ఎక్సెల్సి యర్ హోటల్ నందు విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అదే రోజు అనగా 14 12 2025 మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు యూఏఈ దేశంలోని దుబాయ్ కెరీర బిల్డింగ్ నందు గల ఫెయిత్ ఫుల్ గాస్పెల్ కరామ చర్చ్ నందు ముఖ్య ప్రసంగీకులుగా డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ ని ఆ చర్చి పాస్టర్ సరేలే యేసు మరియు సిస్టర్ మేరీ జ్యోతి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రదర్ ప్రవీణ్ బ్రదర్ చే దేవుని సంగీత ఫిబ్రవరి ఉంటుందని తెలిపారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ నీల శామ్యూల్ మాట్లాడుతూ 12 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ పలు కార్యక్రమాలలో పాల్గొని ఉన్నారని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News