నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 7 , ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగుల సమావేశపు గదిలేక ఉద్యోగస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం నాడు ఆసుపత్రిలో ఆశాడేను నిర్వహించారు. ఆశా కార్యకర్తల సమావేశం గదులకు వెళ్లే దారిలోనే నిర్వహించడం వల్ల అటు ఉద్యోగస్తులకు ఇటు రోగులకు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ధన్వాడ ప్రభుత్వ ఉద్యోగస్తుల సమావేశం గదిని మంజూరు చేయాలని ఉద్యోగస్తులు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు కోరుతున్నారు.





