నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 28చౌడేపల్లి మండలం నాటు బాబు పేలి పాడావు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది .బాధిత రైతు కథనం మేరకు… మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ బూటకపల్లి సమీపంలో గల అడవిలో ఆర్ వెంకటరమణ కు చెందిన పాడావు మేస్తుండగా వన్యప్రాణులకు అమర్చిన నాటుబంబును ఆవు కొరకడంతో అది పేలింది .ఈ ప్రమాదంలో పాడావు తీవ్ర గాయాల పాలయింది ఇటీవల కాలంలో అడవిలో నాటుబంబులు అధికంగా పెడుతున్నారని .సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.





