నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 13, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రచార రథం ద్వారా నారాయణపేట మండలంలోని కోటకొండ తిరుమలాపురం, అభంగాపురం, బండగొండ విస్తృతంగా బడిబాట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటకొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ మన అందరి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచడమే అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో తపస్ మండల గౌరవ అధ్యక్షులు శంకర్ నాయక్, తపస్ నాయకులు శ్రీనివాస్,రమణ, అంబర్నాథ్, చంద్రకాంత్, సాయి కిరణ్,,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.





