Wednesday, March 18, 2026

*నూతన ఆవిష్కరణలకు వేదికగా అపోలో టార్‌’ఐజిమ్–2025*- *వందలాది ఇన్నోవేషన్ ప్రదర్శనలు**- ప్రతిభ చాటిన యువ శాస్త్రవేత్తలు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిత్తూరు,* నవంబర్‌ 18ః యువ పరిశోధకుల్లో శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన పరిశోధన–ఇన్నోవేషన్ మహోత్సవం టార్‌’ఐజిమ్–2025 మంగళవారం మురకంబట్టలోని అపోలో నాలెడ్జ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎంఎస్‌ఆర్‌–అపోలో యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ వార్షిక ఉత్సవం, కొత్త ఆలోచనలను వెలికితీసి వాటిని శాస్త్రీయ పరిష్కారాలుగా మార్చే వేదికగా నిలిచి యువతలో పరిశోధనా స్పూర్తిని మరింత బలోపేతం చేసింది.ముఖ్య అతిథిగా వచ్చిన వైస్–చాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్ జ్యోతి ప్రజ్వలన చేసి టార్‌’ఐజిమ్–2025ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “పరిశోధనలే విశ్వవిద్యాలయ ప్రతిష్టకు ఆధారమైన మూలస్తంభాలు. పబ్లికేషన్‌ ఆధారిత పరిశోధనలు విద్యా నాణ్యతను మరింతగా పెంచుతాయి. టార్‌’ఐజిమ్‌ వంటి వేదికలు విద్యార్థులకు పరిశోధనపై ఆసక్తి, ప్రేరణ కలిగిస్తాయి,” అని తెలిపారు.విద్యార్థులు కొత్త ఆలోచనలు పంచుకోవడం, చర్చించడం, వాస్తవ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనడం వంటి పరిశోధన సంస్కృతి ఇలాంటి ఉత్సవాల ద్వారా బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. అపోలో నాలెడ్జ్‌ సీఈఓ శివరామకృష్ణన్ వి వర్చువల్‌గా మాట్లాడుతూ, విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, ఇన్నోవేషన్స్‌ పెంపొందించేందుకు అపోలో నాలెడ్జ్‌ నిరంతరం ప్రోత్సహిస్తోందన్నారు. మెడికల్‌, అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ రంగాల్లో పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పిస్తూ, ట్రెండ్‌ మైండ్‌సెట్‌ అభివృద్ధి చేయడం సంస్థ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఏఐఎంఎస్‌ఆర్ అసోసియేట్‌ డీన్‌ (రీసెర్చ్‌) డాక్టర్‌ ఉషా అదిగ స్వాగత ఉపన్యాసం ఇస్తూ టార్‌’ఐజిమ్–2025 యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ పోస్టర్‌ ప్రదర్శనలు, సిస్టమాటిక్ రివ్యూ–కేస్‌ స్టడీ పోస్టర్లు, క్లినికల్ ఇన్నోవేషన్ ఆధారిత హ్యాకథాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది యువ పరిశోధకులు తమ కొత్త ఆలోచనలు, అధ్యయనాలు, ఆరోగ్యరంగానికి సంబంధించిన ఇన్నోవేటివ్‌ పరిష్కారాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో పోస్టర్‌ పోటీలు, హ్యాకథాన్‌లలో విజేతలకు అతిథులు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ది అపోలో యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. పోతరాజు, ఏఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డా. అల్ఫ్రెడ్‌ జె. అగస్టిన్‌, అసిస్టెంట్‌ డీన్‌ డా. రమ్యా రామకృష్ణన్, టార్‌’ఐజిమ్–2025 ఆర్గనైజింగ్‌ చైర్‌పర్సన్‌ డా. రమ్యా ఆర్‌, ఫార్మకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డా. సచిదానంద ఆదిగ ఎం.ఎన్‌, ఏఐఎంఎస్‌ఆర్‌ హైదరాబాద్‌ ఫార్మకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దొరబాబు, తిరుపతి క్లినికల్‌ ఫార్మకాలజిస్ట్‌ డాక్టర్‌ అరుణతో పాటు అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News