నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 20దేశంలో పోలియో మహామ్మారిని తరిమి వేయాలని ప్రభుత్వం వారు ఈనెల 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వైద్యాధికారిని మోనా అన్నారు పల్స్ పోలియో విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఐదేళ్ల లోపు పిల్లలందరిని పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని కోరారు అనంతరం బస్టాండ్ లో ర్యాలీ అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు, ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.





