నేటి సాక్షి, నల్లబెల్లి ప్రతినిధి ఆగస్టు 31 : ప్రస్తుత విద్యా సంవత్సరానికి నల్లబెల్లి మండలంలో మూడు పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి జిల్లా నుండి అనుమతి లభించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం. అనురాధ తెలియజేశారు.యుపిఎస్ లంకాలపల్లి,పిఎస్ రామతీర్థం,పిఎస్ రంగాపురం పాఠశాలలలో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.ఇన్స్ట్రక్టర్ కు విద్యార్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత తప్పనిసరి,ఆయా విద్యార్హత: కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని.
అభ్యర్థులు తమ పూర్తి వివరాలు అవసరమైన పత్రాలను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, నల్లబెల్లి లో సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా సమర్పించాలి అని తెలిపారు.





