నేటి సాక్షి చిలుకూరు రామాపురంలో ప్రశంసలుసూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని రామాపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 17వేల రూపాయలతో ప్రహరి గోడను దాత మేజర్ తిపిరిశెట్టి సాయి భార్గవ్ సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.పాఠశాల ప్రాంగణం భద్రతతో పాటు విద్యార్థులకు అనుకూల వాతావరణం ఏర్పడేలా ఈ ప్రహరీ గోడ ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎన్జీ శివకుమారి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాయబారపు వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ-విద్యార్థులు కలిసి దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.





